కులాంతర ప్రేమ తల్లితండ్రులు ఒప్పుకోరేమో అని

intercaste love affiliate parents can not agree

హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో  ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించరని భావించి ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ లాడ్జిలో రెండు రోజుల క్రితం ఓ ప్రేమ జంట దిగింది. ఆ వెంటనే విషం తాగి వీరు ఆత్మహత్య చేసుకున్నారు. గది అద్దెకు తీసుకున్నప్పటి నుంచి వీరు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వారొచ్చి తలపులు బద్దలుగొట్టి చూడగా యువజంట విగతజీవులుగా పడి ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరిని నల్గొండ జిల్లా  కొరతాండ చిల్లాపురం గ్రామానికి చెందిన కొర్రా మోహన్‌ నాయక్‌(25), అదే ప్రాంతంలోని  శ్రీనివాసనగర్‌ కాలనీలో నివసించే స్వర్ణలత(21)గా గుర్తించారు. యువకుడు ఎల్బీనగర్‌లో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, యువతి బీటెక్ పూర్తి చేసింది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరూ తమ ప్రేమను పెద్దల ముందు చెప్పే ఉంచే ధైర్యం చేయలేక చెప్పినా కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు స్వర్ణలత ఇంటికి నుండి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 7న ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వీరి కోసం నగరంలో పలు చోట్ల గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోగా స్వర్ణలత మొబైల్ ట్రాకింగ్‌లో సిగ్నల్స్‌ ఆధారంగా లాడ్జి సమాచారం తెలిసింది. దీంతో చందానగర్‌ పోలీసులు లాడ్జికి వెళ్లి సమాచారం సేకరించారు.