సీరియల్ నటి అనుమానస్పద మృతి

సీరియల్ నటి అనుమానస్పద మృతి

టీవీ యాంకర్‌ మరియు సీరియల్‌ నటిగా ప్రేక్షకులని అలరించిన నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా చంపేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు. శాంతి మరణంతో పలువురు టీవీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నటి శాంతి అనుమానాస్పద మృతితో ఆమె ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు మరియు ఇంటి పరిసరాల్లోని సీసీ పుటేజీలను కూాడా పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.