ఎమ్మెల్యే మీద కోపంతో సెల్ టవర్ ఎక్కిన టీడీపీ కార్యకర్త…

tdp Activist climb on cell tower demands to ravela kishore

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబుకి మంత్రి పదవి పోయినా ఇంకా బాడ్ టైం కొనసాగుతూనే ఉన్నట్టు వుంది. ఆయన్ని టార్గెట్ చేస్తూ ఓ సీనియర్ టీడీపీ కార్యకర్త ఏకంగా సెల్ టవర్ ఎక్కేసాడు. ఎన్టీఆర్ బొమ్మ, టీడీపీ జెండా, పసుపు దుస్తులతో సహా సెల్ టవర్ ఎక్కిన ఆ కార్యకర్త ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏమిటో చూద్దామా.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, కాట్రపాడు గ్రామవాసి, సీనియర్ టీడీపీ కార్యకర్త పెరుగు రామకృష్ణయ్య. తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు సర్వేయర్, రెవిన్యూ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని రామకృష్ణయ్య ఎప్పటి నుంచో వాపోతున్నాడు. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు దృష్టికి తీసుకెళ్ళారంట. అయినా ప్రజలు ఎదుర్కొంటున్న రెవిన్యూ సమస్యల గురించి ఎమ్మెల్యే పట్టించుకోలేదని, దీంతో సిబ్బంది ఇంకాస్త రెచ్చిపోయి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారని పెరుగు రామకృష్ణయ్య ఆరోపిస్తున్నాడు. ఇక ఈ సమస్యకి సామరస్యపూర్వకంగా పరిష్కారం దొరకదని భావించి అతను సెల్ టవర్ ఎక్కి తన నిరసన తెలియజేశాడు. ఆయన్ని కిందకు దించడానికి ప్రయత్నిస్తున్న వారితో రెవిన్యూ సమస్య పరిష్కారం కోసమే డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఎమ్మెల్యే రావెల తన అనుచరుల్ని పంపి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

డ్రగ్స్ కేసులో పార్ట్ -2 ఉందా.. లేదా..?

పరువా.. పార్టీయా..? కోట్ల డైలమా

కేటీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్