ఒక్క మాట.. రివర్స్ అయింది

tdp leaders complaints to EC against on Ys Jagan Shoot CM remark

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నంద్యాలలో తమకు అంతా అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్న వైసీపీ… తమ అధినేత వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడింది. ఈసీ కూడా జగన్ మాటల్ని సుమోటోగా స్వీకరించి… వివరణకు ఆదేశించడం వారికి మింగుడుపడటం లేదు. దీనికి తోడు టీడీపీ నేతలం కంప్లైంట్లు ఉండనే ఉన్నాయి.

బహిరంగ సభలోనే శిల్పా చక్రపాణి రెడ్డితో రాజీనామా చేయించి… ఆ లేఖ జనానికి చూపించారు జగన్. ఇంకేముంది తమ నేత నైతికతకు మారుపేరని వైసీపీ నేతలు డబ్బా కొట్టారు. కానీ అదే సభలో తన పరువు తానే తీసుకున్నారు జగన్. సీఎంను కాల్చేయాలనడంతో… సీన్ రివర్సైంది.

మాట్లాడేటప్పుడు ఫ్లోలో మాట్లాడేసిన ఆ తర్వాత మాత్రం రియలైజయ్యారట. ఈసీ సుమోటోగా తీసుకోవడం ప్రాబ్లమేనని గ్రహించి… తన సొంత పేపర్లో తాను మాట్లాడిన మాటలు రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని, జగన్ మాటలతో జనంలో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ నేతలు సంబరపడుతున్నారు.

మరిన్ని వార్తలు:

మూడు ముక్కలాటకు అంతమెప్పుడు..?

తెలుగు రాష్ట్రాల నుంచి పదవులెవరికి..?

కవిత మెగా ముమెంట్