పవన్ మీద టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు !

tdp mp kesineni nani comments on pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేసినా కనీసం ఒక్క సీటు కూడా రాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాని ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసినా ఓడిపోతారని ఈ ఎంపీ వ్యాఖ్యానించడం విశేషం. అతి విశ్వాసంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అని టీవీ చానల్ ప్రతినిధి అడిగినా అలా ఏం కాదని, తనకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసని, తన అంచనాలు తప్పవని ఈ ఎంపీ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan
పవన్ కల్యాణ్‌ను తను దగ్గర నుంచి గమనించానని ఆయనకు స్థిరత్వం ఉండదని, ఒక మాట మీద నిలబడలేరని అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ తర్వాత బయటకు వచ్చిన నేపథ్యం ఉంది కేశినేని నానికి. చిరంజీవితో పోల్చి చూసినప్పుడు పవన్ కల్యాణ్ చిన్నబోతారని, పవన్ కల్యాణ్ తో పోలిస్తే చిరంజీవి అనేక రెట్లు శక్తిమంతుడు అని, పవన్ కల్యాణ్ కన్నా చిరంజీవికి క్రేజ్ కూడా చాలా ఎక్కువ అని నాని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అనేది చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు కలిసి ఏర్పాటు చేసిన వ్యవస్థ అని దానికే 18 సీట్లు వచ్చాయని, చిరంజీవి స్వయంగా పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ కల్యాణ్‌కూ అదే అనుభవం అని తప్పదని నాని వ్యాఖ్యానించారు.

pawan and chiranjeevi