ఫిదా’ అయ్యి వరాలు ప్రకటించిన కేసీఆర్‌

Telangana CM KCR in full praise of Fidaa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుణ్‌ తేజ్‌ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు భారీగా వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో ఎప్పుడు రాని కలెక్షన్స్‌ ఈ సినిమాతో వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడి వచ్చినట్లుగా ట్రేడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా మిలియన్‌ మార్క్‌ను సాధించింది. ఇంత ఘనత సాధించిన ఫిదాకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

ఒక తెలంగాణ అమ్మాయి తెగువ, పట్టుదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ చూశారు. సినిమాపై కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల మరియు నిర్మాత దిల్‌రాజులను అభినందించిన కేసీఆర్‌ సాయి పల్లవిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సినిమాకు వినోదపు పన్నును మినహాయింపు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇలా ప్రభుత్వం నుండి వినోదపు పన్ను మినహాయింపు దక్కుతుంది. ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు దక్కడంతో నిర్మాత దిల్‌రాజుకు మరింత లాభాలు ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు

 డ్రగ్స్‌ ఇష్యూ : కాజల్‌, లావణ్య, రాశిఖన్నాలు కూడా..!

పిక్‌టాక్‌ : నారా రోహిత్‌ ఇలా అయ్యాడు ఏంటి?

కొరటాల జెట్‌ స్పీడ్‌ మీదున్నాడుగా..!