తెలంగాణ రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు

తెలంగాణ రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు

తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి పదో రోజుకు చేరింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. సోమవారం బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, మానవహారం, 16న ర్యాలీలు, 17న ధూం ధాం, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు విపక్షాలు మద్దతు తెలిపాయి.