భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్లు నేడే విడుదల..!

India-Australia
India-Australia

వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఆడే మ్యాచ్ల టికెట్లను BCCI విడుదల చేయనుంది.అక్టోబర్ 8న భారత్-ఆస్ట్రేలియా (చెన్నై), అక్టోబర్ 11న భారత్-ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ), అక్టోబర్ 19న భారత్-బంగ్లాదేశ్ పూణే మ్యాచ్ టికెట్లు ఇవాళ రాత్రి 8 గంటలకు రిలీజ్ అవుతాయి. tickets.cricketworldcup.com వెబ్సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

కాగా, నిన్నటి నుంచే పాకిస్తాన్ మరియు శ్రీలంక లు వేదికలుగా ఆసియా కప్ 2023 ప్రారంభం అయిన విషయం తెలిసిందే. మొత్తం 6 జట్లు ఈ టోర్నీలో టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఇందులో ఇండియా, పాకిస్తాన్ , శ్రీలంక , నేపాల్, ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక అన్ని టీం లో కసరత్తులతో సమాయత్తం అవుతున్నాయి.