హామీ జారింది…ఇబ్బంది పడుతోంది !

మలయాళ నటి మంజు వారియర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు, కాని మంజు తమిళం మరియు మలయాళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు వారికి కూడా ఒక కేసు విషయం గుర్తు చేస్తే గుర్తొస్తుంది. అదేనండీ నటి భావన లైగింక వేధింపుల కేసులో మళయాళ హీరో దిలీప్ ఉన్నాడు కదా ఆయన గారి మాజీ భార్య. లేటు వయసులో కూడా హీరోయిన్‌గా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈమె 18 నెలల క్రితం కేరళలోని ఒక స్లమ్‌ ఏరియాకు వెళ్లింది. అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అయ్యో మీకు నేను 50 ఇల్లులు కటిస్తాను, మీ అందరిని పక్కా ఇల్లులు ఇప్పిస్తానంటూ మాట ఇచ్చింది. మంజు వారియర్‌ హామీతో అక్కడి జనాలు ఫుల్‌ హ్యాపీ అయ్యారు. కాని ఆమె హామీ ఇచ్చి 18 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుక కదిలింది లేదు. దాంతో స్థానికులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. చేతకానప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలంటూ ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. మంజు వారియర్‌ తీరుపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న స్థానికులు త్వరలోనే తమకు కట్టిస్తానంటూ హామీ ఇచ్చిన ఇల్లను వెంటనే కట్టించాలని, లేదంటే ఇంటి ముందు దర్నాకు దిగుతామంటూ ఆమెకు హెచ్చరికలు పంపారట. వారి హెచ్చరికతో మళయాల సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతుంది. అసలు మంజు వారియర్‌ ఇంత హామీ ఇచ్చి ఎలా మర్చి పోయిందని అంటున్నారు. అయితే మంజు మాత్రం ఇల్లులు కట్టేందుకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపింది. మరి ఇలా మద్యలో వదిలేసిందో ఆమెకే తెలియాలి.