గృహప్రవేశం వాయిదా…అందుకేనట !

Jagan House Warming Ceremony

వైసీపీ అధినేత జగన్ అమరావతిలో నిర్మించిన కొత్త ఇల్లు ప్రారంభోత్సవం అనూహ్యంగా వాయిదా పడిం. ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే ఫిబ్రవరి 14న అంటే రేపు గృహప్రవేశం జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వైసీపీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జగన్‌ సోదరి షర్మిల దంపతులు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గృహప్రవేశాన్ని వాయిదా వేస్తున్నామని పేర్కొంటూ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని సుబ్బారెడ్డి వివరించారు. మరో వైపు ఈరోజు ఒంగోలులో జరగాల్సిన ప్రకాశం జిల్లా సమర శంఖారావం సభ కూడా వాయిదా పడింది. మిగతా జిల్లాల్లో సభలను నిర్వహించే తేదీలపై ఫిబ్రవరి 17న ఏలూరులో జరిగే బీసీ గర్జన తర్వాతనే ఖరారుచేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.

వాస్తవానికి జగన్ తన గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సైతం ఆహ్వానించారు. అదే రోజు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలకు కేసీఆర్ హాజరుకానున్నారు. పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా విశాఖ వెళ్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో పాటు జగన్ గృహప్రవేశంలోనూ పాల్గొంటారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా జగన్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో రూపుదిద్దుకుంటున్నాయి. విభజన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో నివాసం ఏర్పాటు చేసుకోగా, ఇటీవల జనసేన అధినేత పవన్ ఇల్లు, కార్యాలయం ఒకే చోట నిర్మించుకున్నారు. అందుకే జగన్ కూడా అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.