యానిమల్ రివ్యూతో త్రిష ట్రోల్స్ కి టార్గెట్!

యానిమల్ రివ్యూతో త్రిష ట్రోల్స్ కి టార్గెట్!
Animal Movie

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో కలయికలో వచ్చిన సినిమా యానిమల్. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. ఐతే, ఈ యానిమల్‌ సినిమాలో స్త్రీలను తక్కువగా చూపించారంటూ కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతు ఉన్నారు . ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష యానిమల్ సినిమా ‘ఒకటే పదం-కల్ట్’ అంటూ తన ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టేసింది .దీంతో, త్రిష పోస్టు పైనా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

యానిమల్ రివ్యూతో త్రిష ట్రోల్స్ కి టార్గెట్!
Trisha, Ranbeer Kapoor

వారం క్రితమే మహిళల గౌరవం గురించి మాట్లాడి, ఇప్పుడు యానిమల్‌ సినిమాను పొగుడుతున్నారా అంటూ పలువురు నెటిజన్లు త్రిష ను ఎద్దేవా చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నెగిటివ్ కామెంట్స్ చూసిన త్రిష, ఆ వెంటనే తన పోస్ట్ ని తొలగించింది. ప్రస్తుతం ఇది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండగా.. కేవలం రెండు రోజుల్లోనే రూ.236 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.