నారా రోహిత్ ‘వీరభోగ వసంత రాయలు’ టీజర్ : …సైలెన్స్ బ్రేక్ చేయాల్సిందే

Veera-Bhoga-Vasantha-Rayalu

నారా రోహిత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చినా, పెద్దగా హడావుడి లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు రోహిత్. రోహిత్ సినిమా అంటే వైవిధ్యం కోసం పది చచ్చేవారికి విందు భోజనం లాంటిది అన్న మాట. మూస సినిమాలు చేసుకుంటూ పోకుండా ప్రతీ సినిమాలో వైవిద్య్హం కనపడేలా చుసుకంటాడు. తాజాగా మరో వెరైటీ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నాడు నారారోహిత్. ‘వీరభోగవసంతరాయలు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్‌తో పాటు సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, శ్రియా శరణ్‌లు కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటిస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలయ్యింది.

Veera-Bhoga-Vasantha-Rayalu

‘నాకు తెలుసు మీరు వాళ్ల రాక కోసం ఎన్ని పూజలు, వ్రతాలు చేస్తున్నారో అని…’ అంటూ నారారోహిత్, ఓ మీడియా సమావేశంలో చెబుతూ ఉండగా టీజర్ మొదలవుతుంది. చివర్లో ఓ ముసుగు వ్యక్తి గుర్రం మీద వస్తుంటాడు. అతనెవరు అనేది చెప్పకపోయినా, ఇంతకుముందు విడుదలయ్యిన ఫస్ట్ లుక్ పోస్టర్లను బట్టి చూస్తే, గుర్రం మీద స్వారీ చేసే వ్యక్తి శ్రీవిష్ణుయేనని ప్రేక్షకులకి యిట్టె అర్ధం అయిపోతుంది. టీజర్ సినిమా మీద అంచనాలు పెంచుతుండగా సినిమా ఇంకెన్ని సంచలనాలకి వేదిక కానుందో ? అనే అనుమానం రేకేత్తుతోంది. మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి.