Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొంత కాలంగా సినిమాల సంఖ్యను బాగా తగ్గించిన వెంకటేష్ ఇటీవలే ‘గురు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విడుదల తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ తాజాగా తన తర్వాత సినిమాకు కమిట్ అయిన విషయం తెల్సిందే. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తేజకు వెంకీ ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబో మూవీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు తేజ తన ట్యాలెంట్ను నిరూపించుకోవడంతో వెంకటేష్ ఆయనతో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. కేవలం మూడు నెలల్లోనే ఈచిత్రాన్ని పూర్తి చేసేలా దర్శకుడు తేజ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
వచ్చే వేసవి ఆరంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి టైటిల్గా ‘ఈ నగరానికి ఏమైంది’ను కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ప్రతి తెలుగు సినిమా ప్రారంభంకు ముందు మద్యపానం, ధుమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేందుకు ఈ నగరానికి ఏమైంది అంటూ ఒక వీడియోను థియేటర్లలో ప్లే చేసేవారు. ఆ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ నగరానికి ఏమైంది, ఈ మనుషులకు ఏమైంది, ఈ ఉద్యోగస్తులకు ఏమైంది… ఇలా పలు రకాలుగా జోకులు పేళుతున్నాయి. ఇలాంటి సమయంలో టైటిల్గా దీన్ని ఎంచుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
వెంకటేష్ కోసం చాలా కాలం క్రితం తేజ కథను సిద్దం చేయడం జరిగింది. ఆ కథ నచ్చినప్పటికి అప్పుడు తేజకు వరుసగా ఫ్లాప్లు వస్తున్న నేపథ్యంలో వెంకీ సాహసం చేయలేక పోయాడు. ఇప్పుడు అదే కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి, ఈతరం యువత మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునే విధంగా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్కు తీసుకు వెళ్లబోతున్నారు. వెంకటేష్ ఈ చిత్రంలో విభిన్నంగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆకట్టుకునే అంశాలతో పాటు, వెంకీ మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందట. ‘ఈనగరానికి ఏమైంది’ అనే టైటిల్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.