హైదరాబాద్ ఏప్రిల్ 12, (తెలుగు బుల్లెట్) జాతకరీత్యా అమ్మాయిల ఆలస్య వివాహంకి కారణాలు దయచేసి క్రింద వీడియో చూడండి
గర్భం మరియు గర్భధారణ లక్షణాలను ఎలా నిర్ధారించాలి?
హైదరాబాద్ ఏప్రిల్ 9, (తెలుగు బుల్లెట్) డాక్టర్ సి జ్యోతి (సంతానోత్పత్తి నిపుణుడు ) గర్భం మరియు గర్భధారణ లక్షణాలను ఎలా నిర్ధారించాలి? స్పష్టంగా వివరించబడింది దిగువ వీడియోలో .
కాబట్టి గర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది
మరింత సమాచారం కోసం సంప్రదింపు సంఖ్య 9392914099
శ్రీ సత్యసాయి ఆరాధన తత్వం
హైదరాబాద్ ఏప్రిల్ 9, (తెలుగు బుల్లెట్) భగవంతుడు భూమి మీద అవతరించటానికి ఒక స్థలాన్ని,ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. ఆ స్థలం పుట్టపర్తి. ఆ వ్యక్తి ఈశ్వరమ్మ. అలాగే ఒక నామధేయాన్ని కూడా.ఆ పేరే సత్యసాయిబాబా. భక్తులు ఆర్తిగా పిలుచుకునే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ప్రేమ, శాంతి, దయ, ధర్మం, అహింస భావనలే మానవ జాతికి ముక్తి మార్గమని ఉద్బోదించి, తాను స్వయంగా ఆచరించి మానవ జన్మ సార్ధకం చేస్తున్న అపర భగవానుడు. ఆయన భోధనలు మానవాళికి మార్గదర్శనాలు. ఆయన తత్వం ప్రేమ తత్వం. ఆయన మార్గం దైవ మార్గం. మన కోసం మన మధ్యే నడయాడుతున్న దైవ స్వరూపం. ప్రపంచమంతా ఒక్కటయ్యే మధుర క్షణం మనందరి కోసం వేచి ఉందని, మనుషులంతా దానికోసం కలిసి కట్టుగా పాటుపడాలనీ ఆయన ఉపదేశించారు. మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు. నా మార్గంలో గాని, మరో మార్గంలో గాని శిష్యులను, భక్తులను ఆకర్షించడం నా అభిమతం కాదు…. విశ్వవ్యాప్తమైన, ఏకమైన ఆధ్యాత్మిక సూత్రం – ప్రేమ అనే మార్గం, ధర్మం, బాధ్యత – ఈ ఆత్మ సత్యాన్ని చెప్పడానికే వచ్చాను. … తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని వీడమనీ ప్రతి మతం ఉద్బోధిస్తుంది. వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకొని మోక్షాన్ని సాధించుకోవడాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాలలోనూ వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతునే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుని ఆరాధించడానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్య భావాన్ని అవగతం చేసుకోండి. (4 జూలై 1968) ప్రపంచ మానవాళిని సౌభ్రాతృత్వ భావంతో ఏకం చేయడానికి, ఆత్మ సత్యాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ సాయి వచ్చాడు. మనిషినీ మనిషినీ జోడించే ఈ దివ్య సంప్రదాయమే విశ్వాధారమైన సత్యం. ఇది తెలుసుకొంటే మనిషి పశుత్వం నుండి ఎదిగి దివ్యత్వం సాధించగలడు.
దయచేసి వీడియో చూడండి
పాండమిక్ పరిస్థితులతో జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవచ్చు?
ఏప్రిల్ 6 (తెలుగు బుల్లెట్) మాస్టరింగ్ మైండ్ డాక్టర్ అంజు ట్రెసా ఒక మహమ్మారి పరిస్థితులతో జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడం గురించి స్పష్టంగా వివరించారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని ఎదుర్కోలేరు. అందువల్ల శారీరక మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే కొద్ది మందికి ఈ వీడియో సహాయపడుతుంది
దయచేసి క్రింది వీడియో చూడండి.
డాక్టర్ సాసి ప్రియా అరవల్లి: స్థూలకాయత సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందా?
హైదరాబాద్, ఏప్రిల్ 5, (తెలుగు బుల్లెట్) Dr. బకాయం ఫెర్టిలిటీని ప్రభావితం చేస్తుందా అనే విషయంపై డాక్టర్ సాసి ప్రియా అరవల్లి స్పష్టంగా వివరించారు. డాక్టర్ వీడియోలో స్పష్టంగా వివరించారు.
డయాబెటిస్, ఉమ్మడి సమస్యలు, గుండె జబ్బులు మరియు అనేక ఇతర పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతున్నందున అతిగా తినడం మరియు స్థూలకాయత మంచిది కాదు. స్థూలకాయత మహిళల్లో సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి, అలాగే ఆందోళన, గర్భవతి అయ్యే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది.
శరీర ద్రవ్యరాశి సూచిక స్థూలకాయ స్థితిలోకి ప్రవేశించినట్లు సూచించిన పరిమితిని దాటిన తర్వాత అతిగా తినడం వల్ల హార్మోన్ల మార్పులకు కారణం కావచ్చు. స్థూలకాయత ఇన్సులిన్కు నిరోధకతను కూడా కలిగి ఉంటుంది, ఇది చక్రంపై ప్రభావం చూపుతుంది, ఇది వంధ్యత్వానికి అవకాశాలను కూడా పెంచుతుంది. సాధారణ లేదా సహాయక విధానాల ద్వారా గర్భం పొందడం కూడా స్థూలకాయత కారణంగా మరింత సవాలుగా ఉంటుంది, ఎందుకంటే గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, సాధారణ సందర్భాలలో మరియు విట్రో ఫెర్టిలైజేషన్ విధానంలో.
స్థూలకాయత నిజంగా పునరుత్పత్తి పనితీరును మరియు మానసిక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. స్థూలకాయత ఉన్న స్త్రీలు అతిగా తినడం, ఆకారపు ఆందోళనలు మరియు తక్కువ ఆత్మగౌరవ లక్షణాలు యొక్క క్రమరహిత ఆహారంతో ముడిపడివుంటారు.స్థూలకాయత వంధ్య స్త్రీలు అతిగా తినడం, తక్కువ ఆత్మగౌరవం మరియు శరీర ఆకృతి యొక్క ప్రస్తుత లక్షణాలను చేస్తారు.
దయచేసి క్రింద వీడియో చూడండి
సరిహద్దు వ్యక్తిత్వ క్రమరాహిత్యం డాక్టర్ అంజు ట్రెసా
ఏప్రిల్ 2 (తెలుగు బుల్లెట్) మాస్టరింగ్ మైండ్ డాక్టర్ అంజు ట్రెసా సరిహద్దు
వ్యక్తిత్వ క్రమరాహిత్యంపై ఈ క్రింది వీడియోలో స్పష్టంగా వివరించబడింది
సరిహద్దు వ్యక్తిత్వ క్రమరాహిత్యం అనేది ఒక మానసిక ఆరోగ్య రుగ్మత, ఇది
మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు భావించే మరియు ఆలోచించే
విధానాన్ని ప్రభావితం చేస్తుంది మరియు రోజువారీ జీవితంలో పనితీరును
కలిగిస్తుంది. ఇందులో స్వీయ-ఇమేజ్ సమస్యలు, భావోద్వేగాలు మరియు
ప్రవర్తనను నిర్వహించడంలో ఇబ్బంది మరియు అస్థిర సంబంధాల నమూనా
ఉన్నాయి.
సరిహద్దు వ్యక్తిత్వ క్రమరాహిత్యంతో బాధపడుతున్న చాలా మంది.
దయచేసి దిగువ వీడియో చూడండి దీనికి సహాయపడవచ్చు.
సంతానోత్పత్తి చికిత్సలు & అధునాతన ఐవిఎఫ్ ల్యాబ్ గురించి: డాక్టర్ మృదుల ప్రియాంక (ఫెర్టీ 9)
హైదరాబాద్, మార్చి 17 (తెలుగు బుల్లెట్) డాక్టర్ మృదుల ప్రియాంక ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అండ్ ప్రాసెస్ గురించి వివరిస్తూ, మా సికింద్రాబాద్ బ్రాంచ్లో కొత్తగా అభివృద్ధి చేసిన అధునాతన ఐవిఎఫ్ ల్యాబ్.
మరింత సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి: +919392914099
దయచేసి క్రింది వీడియోలను చూడండి. వీడియో క్రింద ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ మరియు అడ్వాన్స్డ్ ఐవిఎఫ్ ల్యాబ్పై స్పష్టంగా వివరించబడింది
ప్రేరణ ఆలోచనలు: ప్రేరణగా ఎలా ఉండాలి? ఎలా కొనసాగించాలి?
హైదరాబాద్, మార్చి 17 (తెలుగు బుల్లెట్) ప్రేరణతో ఎలా ఉండాలి? ఎలా
కొనసాగించాలి? మనమందరం మన జీవితంలో కొన్ని లక్ష్యాలను
సాధించాలనుకుంటున్నాము. కొన్నిసార్లు ప్రేరణ పొందడం చాలా
సులభం. ఇతర సమయాల్లో మనల్ని ఎలా ప్రేరేపించాలో గుర్తించడం దాదాపు
అసాధ్యం. ప్రేరణ పొందటానికి మరియు ప్రేరేపించబడటానికి కొన్ని మార్గాలను
అన్వేషిద్దాం ...
దృశ్యం 2 | సైకాలజిస్ట్ రివ్యూ: ఎ సైకలాజికల్ అనాలిసిస్
మార్చి 15, తెలుగు బుల్లెట్: బ్లాక్బస్టర్ చిత్రం దృశ్యం యొక్క సీక్వెల్ తీయడం అంత తేలికైన పని కాదు. దర్శకుడు జీతు జోసెఫ్ @ jeethu4ever మరియు అతని బృందం మాకు థ్రిల్లింగ్, తగిన సీక్వెల్ ఇచ్చారు. సాధారణంగా, సీక్వెల్స్లో వాటి మూలాల మెరుపు ఉండదు, కాని మన సమాధానం లేని ఉత్సుకతలకు కృష్ణమ్ 2 @ దృశ్యం 2 మూవీ సరైన సమాధానం.
ఈ చిత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది, మనందరినీ మా సీట్ల అంచున వదిలివేస్తుంది. నటీనటులందరూ తమ పాత్రలలో అద్భుతంగా ఉన్నారు. మోహన్ లాల్ @ మోహన్ లాల్ ఎప్పటిలాగే అద్భుతమైనవాడు.
సరికొత్త లుక్లో కనిపించనున్న ప్రభాస్
‘బాహుబలి’తో ప్రభాస్ హీరో రేంజ్ అమాంతం పెరిగింది. లోకల్ స్టార్ కాస్త నేషనల్ స్టార్ అయిపోయాడు. అందుకే పాన్ – ఇండియా అప్పీల్ ఉండేలా కథలను ఎంచుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. తాజాగా ‘సాహో’తో పలకరించిన ప్రభాస్ ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘జాన్’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే షూటింట్ను స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ను ప్రారంభించనుంది.‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడికల్ లవ్ స్టోరీలో ప్రభాస్కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
1970ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్లో కనిపిస్తాడని సమాచారం. పీరియాడికల్ లవ్స్టోరి కాబట్టి కొత్త షెడ్యూల్ను ఆ స్టైల్లో తెరకెక్కించడానికి యూనిట్ సన్నద్ధమవుతుంది. అందుకోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఓ స్పెషల్ సెట్ను వేస్తున్నాడు.భారీ ఖర్చుతో ఈ సెట్ను నిర్మిస్తున్నారట. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా ‘జాన్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దిశగా పక్కా ప్లానింగ్ జరుగుతుంది.
“స్వీటీ” కొత్త సినిమా టీజర్
అగ్ర కథానాయిక అనుష్క పుట్టినరోజు సందర్బంగా “నిశ్శబ్దం” సినిమా టీజర్ను విడుదల చేశారు. ఇంతకు ముందే ప్రీటీజర్ రిలీస్ అయ్యి ప్రేక్షకులని అలరించగ ఇపుడు ఆసక్తికరంగా ఈ సినిమా టీజర్ను రూపొందించారు.
అనుష్క దివ్యాంగురాలిగా కనిపించగా ఈ సినిమా సస్పెస్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. టీజర్లో విహారయాత్ర పీడకలైందని పేర్కొన్నారు.ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్ సరసన భాగమతి తర్వాత స్వీటీ అనుష్క నటిస్తున్న సినిమా ఇది
అరుందతి సినిమాతో ప్రఖ్యాత నటీమణిగా అనుష్క మంచి పేరు తెచ్చుకుంది. కీలక పాత్రలలో షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. కోన వెంకట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసే ప్రయత్నాలలో సినిమా బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంలో “రెండు” పేరు ఖరారు చేశారు
కారెక్కిన ఏనుగు
థాయిలాండ్లోని ఖానో యాయీ నేషనల్ పార్కులో జరిగిన ఘటన వైరల్ అవుతుంది. ఏకంగా ఒక ఏనుగే కారు మీద ఎక్కబోయి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. దువియా అనే ఏనుగు ఖానో యాయీ నేషనల్ పార్కులో కారు టాప్ మీదెక్కి కూర్చుంది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయ పడలేదు. కారు డ్రైవర్ తన చాకచక్యంతో కారు ముందుకు పోనివ్వగా ఈ భారీ గజరాజం దువియా పక్కకు జరిగినది.
బరువైన శరీరం ఉన్న గజరాజం ఆ వాహనం టాప్ మీద మోపాగానే నుజ్జు అవ్వాల్సిందే. సరైన ఆసరా లేక పోవడంతో పక్కకు జరగడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగ లేదు. ఏనుగు కారు టాపు మీద ఎక్కిన వీడియో మాత్రం అవుతుంది.
థియేటర్లో టిక్కెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ
తమకెంతో ఇష్టమైన ‘రౌడీ’ చేతుల మీదుగా టిక్కెట్లు అందుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. కొంత మంది అమ్మాయిలు అయితే ఎగిరి గంతేశారు. ఇది తన ఫస్ట్ ప్రొడక్షన్ కావడంతో ఫ్యాన్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వచ్చానని దేవరకొండ చెప్పారు. అందుకే, తన ఆనందాన్ని వాళ్లతో ఇలా పంచుకున్నానని చెప్పారు.
ఇదిలా ఉంటే, ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. విమర్శకులు సైతం పెదవి విరుస్తున్నారు. సినిమా అంత గొప్పగా లేదంటున్నారు. ఇది మల్టీప్లెక్సుల్లో ఆడే సినిమా అని.. బి, సి సెంటర్లలో కష్టమేనని విశ్లేషకుల అభిప్రాయం. కాకపోతే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై పెట్టిన డబ్బును అయితే సంపాదించేసుకుంటారని టాక్. ఏదేమైనా విజయ్ స్థాపించిన కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన తొలి సినిమా కావడంతో ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారు.
ఇప్పటికీ అదే గ్లామర్తో ఉన్న లేడీ అమితాబ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనిల్ సుంకరలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. దాదాపు 2 దశాబ్దాల తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే విజయశాంతి రీ ఎంట్రీపై భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో చిత్రయూనిట్ కూడా ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఆమె క్యారెక్టర్ను తీర్చి దిద్దుతున్నారు. గతంలోనే ఆమె పాత్రకు సంబంధించిన ప్రీ లుక్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్. తాజాగా దీపావళి కానుకగా విజయశాంతి లుక్ను రివీల్ చేశారు. ఈ ఫస్ట్లుక్లో విజయశాంతి ఇప్పటికీ అదే గ్లామర్తో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె భారతి పాత్రలో కనిపించనున్నారు.
రాయల్ లుక్లో ఉన్న విజయశాంతి ఫస్ట్ లుక్ కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నైన్టీస్లో స్టార్ హీరోయిన్గా గ్లామర్ రోల్స్తో పాటు లేడి ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించిన విజయశాంతి, తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సినిమాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె తరువాత యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు.
చాలా కాలంగా విజయశాంతి రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో మంది దర్శకులు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చినా, విజయశాంతి మాత్రం రీఎంట్రీ పై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఇన్నేళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన ఇమేజ్కు తగ్గ పాత్ర దక్కటంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా తరువాత ఈ లేడీ సూపర్ స్టార్ తిరిగి వెండితెర మీద బిజీ అవ్వటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
రాత్రికి రాత్రి టాప్ 5 కి చేరిన బాబా భాస్కర్
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్బాస్3 షో ముగింపు దశకు వచ్చింది. రేపటితో బిగ్బాస్3కి ఎండ్కార్డ్ పడనుంది. ఫైనల్కి వెళ్లే టాప్ 5 ప్లేస్ల కోసం హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు. రాహుల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనల్ పోరులో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో బాబా మాస్టర్ జాక్పాట్ కొట్టాడు. అనూహ్యంగా ఫైనల్స్కు అర్హత సాధించాడు.
అనంతరం ఇంటి సభ్యులకు బిగ్బాస్ చుక్కలు చూపించాడు. అర్థరాత్రి వేళ సైరన్ మోగించి.. నామినేషన్లో ఉన్నవారిని బ్యాగులు సర్ధుకొని గార్డెన్ ఏరియాలోకి రావాల్సిందిగా ఆదేశించాడు. దీంతో షాకైన ఇంటిసభ్యులు.. నిద్రమత్తులోనుంచి తేరుకొని బ్యాగులు సర్ధుకున్నారు. శని, ఆదివారాల్లో నామినేషన్ ఉంటే ఇప్పుడు బ్యాగులు సర్ధుకోవాడం ఏంటని అనుకుంటూ.. భారంగా బ్యాగ్లు తీసుకొని గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ పై బాబా మాస్టర్ తనదైన స్టేల్లో జోకులు పేల్చాడు.ఎందుకు ఇప్పుడు బ్యాగ్లు సర్ధమంటున్నారని వరుణ్ అడిగితే బయటకు పిలిచి ఆటోకి డబ్బులు ఇస్తారంట అన్నాడు. మరి మీకేం కావాలి అని వరుణ్ అడగ్గా.. ఫ్లైట్ టికెట్తో పాటు ఓ పది లక్షలు ఇస్తే హ్యాపీగా బయటకు వెళిపోతా అన్నాడు. మరి ఓ బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్ వద్దా అని వరుణ్ పంచ్ వేస్తే..పొద్దునే వద్దులే అంటూ జోక్లు పేల్చారు. అనంతరం తలుపు తెరవడంతో గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యులు వాళ్ల జర్ని గురించి చెప్పమని బిగ్బాస్ ఆదేశించగా..ఒక్కొక్కరు తమ జర్నీని ఎమోషనల్గా షేర్ చేసుకున్నారు.
అనంతరం ఇంటిసభ్యులకు బిగ్బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఈవారం నామినేషన్స్లో ఉన్న బాబా భాస్కర్ని ప్రేక్షకులు తమ ఓట్లు ద్వారా రక్షించారని చెబుతూ.. బాబాను టాప్5 కంటెస్టెంట్గా ప్రకటించారు. అనంతరం కన్ఫెషన్ రూంకి పిలిచి బాబాకి టికెట్ టు ఫినాలేను అందించాడు. దీంతో ఈ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనను గెలిపించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ.. టికెట్ టు ఫినాలేను ఆడియన్స్ని డెడికేట్ చేశారు బాబా భాస్కర్.దీంతో ఏపిసోడ్ ముగిసింది.కాగా, మిగతా నలుగురిలో ఎవరు ఎలిమేషన్ అవుతారనేది నేటి ఎపిసోడ్ లేదా రేపటి ఎపిసోడ్లో తేలనుంది.
అందరిని భయపెడుతున్న మాజీ ముఖ్యమంత్రి భార్య
విడుదలైన ‘ప్రేమ పిపాసి’ మోషన్ పోస్టర్
జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో, సుమన్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ‘సెర్చింగ్ ఫర్ ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. మురళి రామస్వామిని దర్శకత్వంలో ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్పై రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గశ్రీ ఫిలింస్తో కలిసి పి.ఎస్.రామకృష్ణ నిర్మించారు.
ఈ సినిమా మోషన్ పోస్టర్ని సీనియర్ నటి జమున, సహజ నటి జయసుధ, నటుడు బాబూమోహన్, నిర్మాతలు సి.కళ్యాణ్, అంబటి రామకృష్ణ విడుదల చేశారు. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, రొమాన్స్, కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి పాత్ర కనెక్టయ్యేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రీ రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో ఆడియోతో పాటు టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పి.ఎస్.రామకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్ పండిట్, జియస్ రావ్, వై. వెంకటలక్ష్మి.
‘బ్యాడ్ బోయ్’ వీడియో సాంగ్.. ప్రభాస్ సరసన ఆడి పాడిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్
ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకలో తన అభిమానులకు జాక్వెలిన్ను ప్రభాస్ పరిచయం చేశారు. ఈ వేడుకలో విడుదల చేసిన ‘సాహో’ మూడో పాట ‘బ్యాడ్ బోయ్’లో ప్రభాస్తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆడిపాడింది. ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ స్వయంగా ఈ పాటను లాంచ్ చేశారు.
అయితే, ‘బ్యాడ్ బోయ్’ పాట వీడియోను తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ విడుదల చేసింది. పాట అందమైన అమ్మాయిలతో చాలా కలర్ఫుల్గా ఉంది.
ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ పాటను బాలీవుడ్ కంపోజర్ బాద్షా స్వరపరిచారు. నీతి మోహన్తో కలిసి ఆయనే ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు.
కాగా, ప్రభాస్తో కలిసి పనిచేయడం గురించి జాక్వెలిన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘షాట్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ప్రభాస్ కష్టపడుతూనే ఉంటారు. ఆయనతో పనిచేయడం చాలా సరదాగా, క్రేజీగా అనిపించింది. ఈ పాటలో యాక్షన్ ఎక్కువగా ఉంది.
నాకు కిక్స్, పంచెస్ అంటే ఇష్టం. కానీ, ఈ పాటలోని యాక్షన్ సీక్వెన్స్లో నేను భాగం కాలేదు. తెలుగు లైన్స్ నాకు అర్థం కావు. వాటిని నేను పలకలేను. అలాంటప్పుడు ఈ పాట ఎలా చేయగలను అని నేను భయపడ్డాను. కానీ, ఫస్ట్ టేక్లోనే నేను నా తెలుగు లైన్స్ను స్పష్టంగా పలికాను. నేనే చేశానా అన్నంత ఆశ్చర్యపడ్డాను’’ అని వెల్లడించారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
“సరిలేరు నీకెవ్వరూ” నుండి మరో సర్ప్రైజ్
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు సరిలేరు నీకెవ్వరు సినిమా యూనిట్. భరత్ అనే నేను, మహర్షి వరుస బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత సూపర్స్టార్ మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘F2’ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందనా, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఆ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ను సైనికులకు డెడికేట్ చేస్తూ సైనికుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశం కోసం ఎలా పోరాడుతున్నారో విజువల్గా చూపించారు.
‘భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా…జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు’ అంటూ సాగిన ఈ పాటలో ఇండో పాక్ వార్ 1971, కార్గిల్ వార్ నాటి పరిస్థితుల్ని గుర్తు చేశారు. ఇందులో మహేష్ బాబు మేజర్ అజయ్ క్రిష్ణగా కనిపించారు.
అయితే ఈ టైటిల్ సాంగ్ను సినిమా పరంగా అంత గొప్పగా కంపోజ్ చేయలేకపోయారు దేవి శ్రీ ప్రసాద్. లిరిక్స్ కూడా ఏదో అలా ఉన్నాయి. మొక్కుబడిగా ట్యూన్స్ కట్టినట్టుగా అనిపించింది.