తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా కేరళ వరద బాధితులకు ఏకంగా 14 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. విజయ్ మంచి మనసుతో 14 కోట్ల విరాళంను ప్రకటించడంను అంతా కూడా అభినందించారు. ఎంతో మంది అభిమానులు తమ అభిమాన హీరో కేరళకు ఇంత సాయం చేశాడు అంటూ గొప్పగా చెప్పుకున్నారు. ఇతర హీరోలను ట్యాగ్ చేసి మరీ విజయ్ 14 కోట్ల సాయంను ప్రకటించాడు అంటూ చెప్పడంతో ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది. ఈ విషయంపై తమిళ మీడియా విజయ్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన పీఆర్ఓ క్లారిటీ ఇచ్చాడు. విజయ్ సాయం చేసినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని చెప్పుకొచ్చాడు.
విజయ్ సాయం విషయంలో అభిమానులు అత్యుత్సాహంను కనబర్చుతున్నారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. తమ హీరో గొప్ప వ్యక్తి అని చెప్పేందుకు ఇలాంటి సందర్బాల్లో ఇలాంటి పనులు చేయడం ఏమాత్రం మంచి విషయం కాదు. తమిళంకు చెందిన పలువురు హీరోలు కేరళకు సాయంను ప్రకటించారు. ఇప్పటి వరకు విజయ్ మాత్రం సాయంను ప్రకటించలేదు. కాని విజయ్ అభిమానులు మాత్రం 14 కోట్ల సాయంను చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. సన్నీలియోన్ కూడా 5 కోట్ల విరాళంను కేరళకు పంపించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విషయం కూడా కేవలం ఫ్యాన్స్ సృష్టే అంటూ తేలిపోయింది. సన్నీలియోన్ ఇప్పటి వరకు కేరళ వరదల గురించి స్పందించినదే లేదు.