ముగ్గురు పిల్లల తల్లి…. మరో ప్రేమ పెళ్లి !

villagers forcingly does marriage to a couple in bihar

బీహార్ లో వెలుగు చూసిన ఒక విచిత్ర ప్రేమ వ్యవహారం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం కతిహార్ జిల్లాలో ఒక ముగ్గురు పిల్లల తల్లి ఒక యువకుడితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ విషయం తెలిసి భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఇక తనకు అడ్డు లేదని భావించిన ఆమె పిల్లలుండగానే ప్రియుడితో సరసాలు మొదలెట్టింది. ఈ నేపథ్యంలో వారిద్దరి వ్యవహరం నచ్చని గ్రామస్థులు వారింటి రోడ్డుపైనే ఆ ప్రేమ జంటకు వివాహం జరిపించారు. అయితే ఈ వివాహాన్ని ముగ్గురు పిల్లల తల్లి వ్యతిరేకించే ప్రయత్నం చేయడంతో అక్కడున్నవారు ఆమెను కొట్టి బలవంతనగా వివాహం చేశారు. కాగా ఆమె తన ముగ్గురు పిల్లలను భర్త దగ్గర ఉంచేందుకు ఒప్పుకుంది. వివాహేతర సంబంధాల విషయంలో చంపుకుని నరుక్కుతున్న నేటి రోజుల్లో ఇలా ఒక సంబంధం పెళ్లి పీటలు వరకు వెళ్ళడం కాస్త ఊరట నిచ్చే అంశమే అని చెప్పాలి.