ప్రభాస్ కోసం మహానటి డైరెక్టర్ ఏం చేస్తున్నారంటే..!

ఒక్క బాహుబలితోఅంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా చేస్తున్న విషయం కూడా తెలిసిందే.

అయితే ఇప్పడు మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ అంతర్జాతీయ స్థాయి ఇమేజ్ ఉన్న హీరోతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ముగ్గురి కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమా 2021 చివరినాటికి రిలీజ్ చేయనున్నట్లు అశ్విన్ ఇంతకముందే తెలియజేసారు. కాగా అంతా ఈ సినిమాను పాన్ ఇండియాగా తీస్తారని భావిస్తున్నారు.. కానీ.. పాన్ ఇండియా ఎప్పుడో దాటేశాం.. పాన్ వరల్డ్ సినిమాగా తీస్తామని ఓసారి ట్విట్టర్ వేదిక స్పష్టం చేశారు నాగ్ అశ్విన్. మరి నాగ అశ్విన్ .. ప్రభాస్ తో ఏపాటి సినిమా తీస్తారని వేచి చూడాలి.