ఆడియో వేడుకకు అన్ని కోట్లు ఏందుకురా బుజ్జి!

why did this too much cost in rajinikanth movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Why Did This Too Much Cost In Rajinikanth ‘2.0 ‘ Movie

‘బాహుబలి’ సినిమా విడుదల తర్వాత సౌత్‌ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘2.0’. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘రోబో’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా చెప్పుకోవచ్చు. రజినీకాంత్‌ హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా అమీ జాక్సన్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న ‘2.0’ చిత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో శంకర్‌ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను అంతే స్థాయిలో ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో శంకర్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమోషన్‌ అంతా పక్కన పెడితే కేవలం ఆడియో విడుదల కోసం 25 కోట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. దుబాయిలో ప్రపంచం మొత్తం నివ్వెర పోయే విధంగా ‘2.0’ చిత్రం ఆడియోను వైభవంగా విడుదల చేయబోతున్నారు. ఇక మిగిలిన ప్రమోషన్‌ కోసం మరో 25 కోట్లను ఖర్చు చేయనున్నాడు. కేవలం ప్రమోషన్‌ కోసం 50 కోట్లను కేటాయించడంతో సినిమా స్థాయి ఏంటో చెప్పుకోవచ్చు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు

కమల్‌ అబద్దం చెప్తున్నాడు

ఎన్టీఆర్‌ కాబట్టి చేశా.. మళ్లీ చేయను

ఆడియో వేడుకకు అన్ని కోట్లు ఏందుకురా బుజ్జి! - Telugu Bullet