భర్తనే మార్చేసింది : పల్లె సింగర్ బేబీపై పోలీసు కేసు…!

Woman Filed Case Against Village Singer Baby Her Husband

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన పల్లె కోయిల పసల బేబీ వివాదంలో చిక్కుకుంది. ఆమెపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భర్తను ఆమె భర్తగా చెప్పుకుంటోందని ఆరోపిస్తూ ఓ మహిళ సింగర్‌ పసల బేబీపై పోలీసులకు పిర్యాదు చేసింది. పసల వజ్రారావుకు తనకు 20 ఏళ్ళ క్రితం పెళ్లైందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పసల ఉషాకుమారి అనే మహిళ తెలిపింది. అయితే బేబీ తన భర్త వజ్రారావుతో కలిసి తిరుగుతూ ఆయన్ని తన భర్తగా అందరికీ పరిచయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Village Singer Baby

పెళ్లి కాకుండా నా భర్తను ఆమె భర్తగా చెప్పుకోవడం తప్పని ఉషా కుమారి మండిపడ్డారు. విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో కలిసి ఉంటూ భార్యా పిల్లలను వజ్రారావు నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సరైన న్యాయం చేయాలని న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించింది. గతంలోనూ కేసులు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. అయితే ఉషా కుమారి ఆరోపణలపై విలేజ్ సింగర్ బేబీ స్పందించాల్సి ఉంది. కాగా… సింగర్ బేబీ టాలెంటుకు ముగ్దులైపోయిన టాలీవుడ్ సంగీత దర్శకులు ఆమెకు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.