శంషాబాద్ విమానాశ్రయంలో యువతీ మిస్సింగ్… పలు అనుమానాలు !

Woman Missing in Shamshabad Airport

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న అర్ధరాత్రి ఓ మహిళ అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. పోలీసులకు అందిన వివరాల ప్రకారం యార్లగడ్డ సాయి ప్రసన్న(28) అనే యువతిని నిన్న రాత్రి తన భర్త జైపూర్‌లో హైదరాబాద్ విమానం ఎక్కించారు. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సాయిప్రసన్న తండ్రి, సోదరుడు ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. హైదరాబాద్‌ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆమె కోసం తండ్రి, తమ్ముడు ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది… కానీ తండ్రి, తమ్ముడికి కలవకుండా మిస్సయింది.

అయితే సాయిప్రసన్న తండ్రి, సోదరుడికి తెలియకుండా క్యాబ్ మాట్లాడుకుని విమానాశ్రయం నుంచి వెళ్లిపోయింది. క్యాబ్ ఎక్కిన తర్వాత సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో తాము విమానాశ్రయంలోనే ఉన్నామని, క్యాబ్ దిగాలని సోదరుడు చెప్పాడు. అతడి ఫోన్ ను మద్యలోనే కట్ చేసిన ప్రసన్న ఫోన్‌ స్విఛ్చాప్‌ చేసుకుంది. దీంతో ఆమె తండ్రి, తమ్ముడు ఆందోళన చెందారు. సాయిప్రసన్న తండ్రి ఆ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేశాడు.

అల్లుడి సలహా మేరకు ప్రసన్న తండ్రి తన కూతురు సాయిప్రసన్న మిస్సైందని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఎయిర్‌పోర్ట్‌లోని సీసీ టీవీ ఫుటేజీలే కీలకమని పోలీసులు భావిస్తున్నారు. అయితే తన భార్య మిస్సింగ్ వెనుక ఖమ్మంకి చెందిన మోహన్‌ రావు హస్తం ఉందని సాయిప్రసన్న భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై కూడా పోలీసులు దృష్టిసారించి దర్యాప్తు చేస్తున్నారు.