World Cup 2023: రేపే ఫైనల్ మ్యాచ్…సిరాజ్ స్థానంలో అశ్విన్ !

World Cup 2023: Final match tomorrow...Ashwin replaces Siraj!
World Cup 2023: Final match tomorrow...Ashwin replaces Siraj!

రేపే ఫైనల్ మ్యాచ్. ఐసీసీ ప్రపంచకప్ 2023 ఫైనల్స్ లో భారత్ ను ఢీకొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్ లో అడుగు పెట్టింది. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్స్ లో భారత్ తో తలపడుతుంది. ఇక ఫైనల్స్ లో తలపడపోయే భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది.

లీగ్స్ దశ నుంచి సెమీఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ దూకుడు మీద ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ సత్తా చాటుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించింది. బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తుండగా…. బౌలర్లు ప్రత్యర్ధులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయితే.. రేపే ఫైనల్‌ మ్యాచ్‌ ఉన్న తరుణంలో టీమిండియా బౌలర్‌ సిరాజ్ స్థానంలో అశ్విన్ ను తీసుకోవాలని రోహిత్‌ సేన నిర్ణయం తీసుకుందట. సెమీస్‌ లో సిరాజ్‌ దారుణమైన ఆటతీరుతో నిరాశ పరిచాడు. దీంతో సిరాజ్ స్థానంలో అశ్విన్ రానున్నట్లు సమాచారం.