Election Updates: గంగుల ఒక్క ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నాడు– బండి సంజయ్‌

Election Updates: Breaking: Bandi Sanjay's letter to Election Commission..Postpone..!
Election Updates: Breaking: Bandi Sanjay's letter to Election Commission..Postpone..!

ఒక్క ఓటుకు రూ.10 వేలు గంగుల ఇస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్‌. కరీంనగర్ లోని కమాన్ పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్..ఈ సందర్భంగా మాట్లాడారు. భూకబ్జాలు తప్ప మీకేం తెలుసు?ప్రజల కోసం ఎన్నడైనా పోరాడి జైలుకుపోయారా? కరీంనగర్ పై పూర్తి అవగాహనే లేని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్ధి అంటూ ఫైర్‌ అయ్యారు.

లక్ష ఫోన్లు, ఓటుకు రూ.10 వేలును గంగుల నమ్ముకున్నాడు…మీ సమస్యలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర నాదన్నారు. మీరు ఓట్లు వేయకుంటే పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజ వేస్తారు…గంగుల లక్ష సెల్ ఫోన్ల, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నాడని నిప్పులు చెరిగారు. ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పండని బీజేపీ కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ పిలుపు నిచ్చారు. కరీంనగర్ వచ్చి అభివ్రుద్ధి గురించి సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.