పెళ్లాడతానని… కోరిక తీరాక.. యువకుడు పరార్..

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరిగింది. తనతో పాటు ఓ సంస్థలో పనిచేస్తున్న యువతిని పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక కోరికలు తీర్చుకున్న యువకుడు ఆ తర్వాత ఆ బాలికను మోసం చేశాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొదట్లో ప్రేమ పేరుతో వెంటపడి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి శారీరకంగా అనుభవించి తప్పించుకొని తిరుగుతున్న యువకుడిపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది అంటే.. కృష్ణా జిల్లా పోరంకికి చెందిన మెర్నీడి జయరామకృష్ణ విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అదే సంస్థలో గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన ఓ యువతి పని చేస్తోంది. వారిద్దరికీ కొన్నేళ్ల నుంచి పరిచయం అలా కొనసాగుతుంది.

ఆ తర్వాత ఆ యువతిపై కన్నేసిన జయరామకృష్ణ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించాడు. కొద్దిరోజులు కలిసి తిరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. అవకాశం దొరికినప్పుడంతా ప్రియురాలిని గదికి తీసుకెళ్లి లైంగిక కోరికలు తీర్చుకొనేవాడు. అయితే ఈ యేడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మయి… అతడిని కోరింది. అప్పటి నుంచి జయరామకృష్ణ ఆమె కంటపడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. చివరికి మోసపోయానని గ్రహించిన బాధితురాలు కృష్ణా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు జయరామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.