చంద్రబాబు మీద జగన్ ‘పెళ్లిళ్ల’ కామెంట్స్…!

YS Jagan Sensational Comments On Chandrababu Naidu

గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద తీవ్ర వ్యాఖ్యలతో దుమారం రేపి పార్టీలోని కాపు నేతలను దూరం చేసుకుంటున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు ఐదుసార్లు పెళ్ళిళ్ళు చేసుకుని వదిలేసారని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు పెళ్ళిళ్ళు చేసుకుంది పార్టీలని అని ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకుని వదిలేసిన టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్‌తో పెళ్లికి సిద్ధమైందని అన్నారు. అంటే ఇంతకు ముందు ఇతర పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తులను ఆయన పెళ్లిళ్లుగా అభివర్ణించారు. బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, జనసేనలను వివాహం చేసుకుని వదిలేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆఖరికి కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారంటూ విమర్శించారు.

jagan-chandrababu

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు, రాయబారిగా నారా బ్రాహ్మణిని రాహుల్ గాంధీ నిర్వహించిన బిజినెస్ భేటీకి పంపారని జగన్ ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్‌లో రెండు రోజులు పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాలకే చెందిన ఎంటర్ప్రేన్యుయర్ లతో సమావేశమయ్యారు. ఆ భేటీకి హెరిటేజ్ ఫుడ్ తరఫున నారా బ్రాహ్మణి హాజరయ్యారు. అయితే జగన్ మాత్రం రాజకీయ రాయబారం కోసమే బ్రాహ్మణిని చంద్రబాబు ఈ భేటీకి పంపారని ఆరోపిస్తున్నారు.

jagan