అబ్బో … సిబిఐ హనుమంతుడి లెక్కన్న జగన్.

ys jagan speech about on vizag land scam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విశాఖ భూకుంభకోణం లో సూత్రధారుల్ని శిక్షించాలంటూ అక్కడ మహాధర్నా చేసిన వైసీపీ అధినేత జగన్ ఎప్పటిలాగే టీడీపీ మీద ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ మీద విరుచుకుపడ్డాడు. విశాఖలో ప్రభుత్వ భూముల కబ్జా వెనుక మంత్రి గంటా హస్తముందని జగన్ ఆరోపించారు. ఈ విషయాన్ని సాటి మంత్రి అయ్యన్నపాత్రుడే చెబుతుంటే వినకుండా సిట్ తో విచారణ జరిపించి ప్రయోజనం ఏంటని జగన్ నిలదీశారు. సిట్ లో అధికారులంతా చంద్రబాబు కింద పని చేసే వాళ్ళు అయినప్పుడు అసలు నిజాలు ఎలా బయటికి వస్తాయని జగన్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని జనానికి అర్ధం అయ్యేట్టు చెప్పడానికి జగన్ రామాయణాన్ని సరికొత్తగా వినిపించారు. సీతను ఎత్తుకెళ్లిన రావణుడు ఇది తప్పా, ఒప్పా అని తేల్చడానికి కుంభకర్ణుడిని అడిగితే ప్రయోజనం ఉండదని జగన్ అన్నారు. ఇదే విషయాన్ని హనుమంతుడికి అప్పగిస్తే తప్పు ఎవరిదో తేలుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.

సిట్ ని కుంభకర్ణుడితో సిబిఐ ని హనుమంతుడితో పోల్చాడు జగన్. నోరు పారేసుకోవద్దని ఎమ్మెల్యే రోజాకి సుద్దులు చెప్పిన విషయం మరిచిన జగన్ అదే ఊపులో దూకుడుగా మాట్లాడారు. ఈ కేసుని సిబిఐ కి అప్పగిస్తే చంద్రబాబు, లోకేష్ , మంత్రులు, అధికారుల్ని తన్ని లోపల పడేస్తారని జగన్ అన్నారు. ఇంత దూకుడుగా మాట్లాడిన జగన్ ని చూసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నమొన్నటిదాకా సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని చెప్పిన జగన్ ఇప్పుడు దాన్ని హనుమంతుడితో పోల్చడం చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు చమత్కారులు మాత్రం ఓ పాయింట్ రైజ్ చేశారు. సిబిఐ కి కేసు అప్పగిస్తే తన్ని లోపల వేస్తారని జగన్ స్వానుభవంతో చెప్పి ఉంటారని కౌంటర్ వేస్తున్నారు.