కార్తికేయపై దిల్‌రాజు కన్ను

dil-raju-producing-movie-with-karthikeya-sequel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నిఖిల్‌, చందు మొండేటిల కాంబినేషన్‌లో తెరకెక్కి సూపర్‌ హిట్‌ అయిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. నిఖిల్‌ కూడా ఆసక్తిగా ఉన్నాడు. పలు సందర్బాల్లో చందుమొండేటి సీక్వెల్‌ గురించి చెప్పుకొచ్చాడు. ఆ మద్య ‘ప్రేమమ్‌’ రీమేక్‌ సమయంలోనే చందు మొండేటి తాను కార్తికేయ సీక్వెల్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌ను తీసుకు వచ్చేందుకు దిల్‌రాజు సిద్దం అయ్యాడు.

కార్తికేయ సూపర్‌ హిట్‌ అయినా కూడా చందుమొండెటి ఆ తర్వాత సినిమాతో సత్తా చాటలేక పోయాడు. దాంతో సీక్వెల్‌ను నిర్మించేందుకు ఏ నిర్మాత ముందుకు రాలేదు. ఆ కారణంగానే కార్తికేయ సీక్వెల్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా చందు తాను రెడీ చేసిన కథను దిల్‌రాజుకు చెప్పడం, వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. త్వరలోనే నిఖిల్‌, చందులు సినిమాను మొదలు పెడుతున్నారు. నిఖిల్‌ హీరోగా చేయబోతున్న ఈ చిత్రంపై దిల్‌రాజు ఆఫీస్‌ నుండి క్లారిటీ వచ్చింది. అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. చందు మొండెటి ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.