బీజేపీకి భారీ షాక్…సీనియర్ నాయకులు మృత్యుంజయం రాజీనామా..

Big shock to BJP...Senior leaders Mrutyunjayam resigns..
Big shock to BJP...Senior leaders Mrutyunjayam resigns..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపికి భారీ షాక్ ఎదురైంది. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే, బిజెపి సీనియర్ నాయకులు కటకం మృత్యుంజయం బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు

గతంలో కేంద్ర,రాష్ట్ర ఎన్నికల్లో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ… కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీల సంబంధాలు మొదలుకొని…. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల తాను బిజెపి పార్టీలో కొనసాగలేనని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ తనకు అప్పగించిన ఎస్టి కమిటీ బోథ్ నియోజకవర్గ కమిటీ ఇంచార్జీ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.