మలేషియా వెళుతున్న చిరంజీవి…మెగా 154 కోసం భారీ సెట్‌

మెగాస్టార్ చిరంజీవి , డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు కానీ.. అంద‌రూ ‘వాల్తేరు వీరయ్య’ అని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

చాన్నాళ్ల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ప‌క్కా మాస్ లుక్‌లో చేస్తోన్న సినిమా అది. లుక్‌ను కూడా చిత్ర యూనిట్ రివీల్ చ‌సేసిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు మెగా 154 కోసం చెన్నైలో మేక‌ర్స్ భారీ ప‌డ‌వ సెట్‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. ఈ సెట్ వేయ‌డానికి కూడా మేజ‌ర్ టెక్నీషియ‌న్స్‌ను కూడా మ‌న టాలీవుడ్ నుంచే తీసుకెళ్లారు…మ‌రో వైపు ఇదే సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిరంజీవి మ‌లేషియా వెళుతున్నారు.

కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేలా ప్లాన్ చేసుకున్నారు. శ్రుతీ హాస‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగా హీరోల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల‌తో నటించిన శ్రుతీ హాస‌న్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సైతం జోడీ క‌డుతోంది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజచిరంజీవి త‌మ్ముడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.