మోసం: ఎమ్మెల్సీ కొడుకునంటూ దగ్గరై.. ఆపై బ్లాక్ మెయిల్..

ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

తెలంగాణ హైదరాబాదో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తాను ఎమ్మెల్సీ కొడుకుని అని చెప్పి ఓ పెళ్లైన స్త్రీతో పరిచయం పెంచుకున్న యువకుడు కొద్దిరోజుల తర్వాత తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఆమెతో సన్నిహితంగా దిగిన ఫోటోలను అడ్డం పెట్టుకుని అడిగినంత డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ లకు పాల్పడ్డాడు. అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ప్రాంతానికి చెందిన వివాహితకు కొద్దిరోజుల క్రితం భరత్‌కుమార్‌ అలియాస్‌ చింటు అనే యువకుడు పరిచయం అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అతను తాను  ఓ బడా ఎమ్మెల్సీ కుమారుడిని అంటూ ఆమె ముందుకు పోజులు పోయాడు. అలా ఆమెకు మాయమాటలు చెప్పి రంగంలోకి దింపాడు. తరుచూ ఆమె ఇంటికి వెళ్లి ముచ్చట్లు చెప్పేవాడు. దీంతో వారిద్దరు సన్నిహితంగా ఫోటోలు తీసుకోవడం వరకు జరిగింది.

అయితే అదే కొద్దిరోజుల తర్వాత తనలోని మరో కోణాన్ని బయటకు తీసిన చింటు ఆ మహిళను వేధించడం స్టార్ట్ చేశాడు. తనకు రూ.15లక్షలు ఇవ్వకపోతే ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానని బ్లాక్‌మెయిలింగ్ కు పాల్పడ్డాడు. దాంతో బాధితురాలు అతడి బాగోతాన్ని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో విస్తుపోయే నిజాలు పోలీసులు ఆయువకుడి నుంచి రాబడుతున్నారు.