మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీనెం. 150’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదనుకున్న చిరు ఇక తదుపరి చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. అంతేకాకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని స్వాతంత్ర సమరయోధుడి జీవితగాథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ మొత్తంలో బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ లేని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత పోరాటాన్ని చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్టెట్తో రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇదివరకే విడుదలైన ఈ చిత్ర టీజర్కు కూడా మంచి స్పందన వచ్చింది. యుద్ద నేపథ్యంలో కొనసాగుతున్న టీజర్ను విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే భారీ యుద్ద సన్నివేశాలున్న ఈ చిత్రంలో కేవలం యుద్ద నిర్మాణానికే 50కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. సినిమా మొత్తానికి 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.
కానీ సినిమా మొత్తంలో నాలుగు యుద్ద సన్నివేశాలు ఉంటాయట, ఈ నాలుగింటికి కలిపి 50 కోట్లు ఉంటాయి కేవం ఒక యుద్ద సన్నివేశానికే 50 కోట్లు అనేది అంతా అబద్దమే అనే పుకార్లు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కీలక సన్నివేశాలు అన్నీ కూడా జార్జియాలో తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ ఖర్చు కూడా చాలా తక్కుతగా అవుతుంది, ఇకపోతే చిత్ర యూనిట్ ప్రచారం చేస్తున్నట్లుగా భారీ బడ్జెట్ను ఖర్చు చేయడం లేదు, కేవలం పబ్లిసిటీ కోసమే యానిట్ అంతా ఇంతా అంటున్నారు అంటూ వార్ బడ్జెట్ గురించి ప్రేక్షకుల మధ్య వార్ లాంటిదే జరుగుతోంది.