సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి రూపొందుతుంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సౌత్, నార్త్ ఇండియా కు చెందిన పలువురు హీరోస్ నటిస్తున్నారు. చిరంజీవి ఈ చిత్రంలో విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల అవ్వుతుంది అని సినిమా స్టార్ట్ అయ్యిన కానుంచి సోషల్ మీడియాలో ఓ ఉధరగేట్టేస్తున్నారు. మెగా అభిమానులు కూడా సైరా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు . కానీ ఇప్పుడు ఈ చిత్రం పై వస్తున్నా వార్త మెగా అభిమానులకు చేదు వార్తే అని చెప్పుకోవాలి.
సైరా నరసింహా రెడ్డి 2019 సమ్మర్ లో కానీ, 2019 ఆగస్ట్ 15 కి రావడం లేదట. 2020 సంక్రాంతికి విడుదల అవ్వుతుంది అని విస్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఈ చిత్రం భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడుకొని ఉన్నది. ఈ చిత్రం క్వాలిటి గా రావాలి అంటే చాలా సమయం పడుతుంది. కావునా ఈ వర్క్ అంత పూర్తి అయ్యేసరికి చాలా సమయం పట్టే లా ఉన్నది అని అంటున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రని బాలీవుడ్ లో భారీగా విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాడు. అందుకని ఈ చిత్రంలో భారీ యుద్ద సన్నివేశాలు ఉన్నాయి వాటికీ పూర్తిగా విజువల్ అండ్ గ్రాపిక్ వర్క్ చెయ్యడాని చాలా టైం పడుతుంది. కావునా 2020 సంక్రాంతి వరకు అగలిసిందే అంటున్నారు.