హైదరాబాద్ వచ్చేసిన సైరా యూనిట్ !

Sye Raa Unit In Hyderabad

చిరంజీవి తాజా సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని కర్ణాటకలోని బీదర్‌లోని బహుమనీ సుల్తాన్‌ కోటలో జ‌ర‌పాల‌ని భావించింది చిత్ర బృందం. కాని కోటలోని ముస్లిం ప్రార్థనా స్థలంలో హిందూ దేవతల విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారని అక్కడి యువకులు అభ్యంతరం చెప్పడంతో అక్కడ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగేలా చేశారు.

అయితే కోట‌లో హిందూ విగ్రహాలను, చిత్రీకరణకు వేసిన సెట్‌ను తొలగించినట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో చిత్ర బందం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతం అయిన కోకాపేట‌లో స్పెష‌ల్ కోట సెట్ వేసి అక్క‌డ చిత్రీక‌ర‌ణ‌ని కొన‌సాగించాల‌ని అనుకుంటుందని సమాచారం. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర బృందం భావిస్తుంది.