‘సైరా’ క్లైమాక్స్‌లో మార్పులు?

sye-raa-movie-climax

చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల నడుమ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలను రేకెత్తిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం క్లైమాక్స్‌ను మార్చబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ముందుగా ఈ చిత్రం క్లైమాక్స్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చనిపోతాడని చూపించాలని భావించారు. అయితే హీరో చనిపోయిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆధరించరు. అందుకే పాజిటివ్‌గా ఉండేలా క్లైమాక్స్‌ను ప్లాన్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

sye-raa-movie-climax

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చనిపోకుండానే సినిమాను పూర్తి చేయాలా లేదంటే, ఉయ్యాలవాడ చనిపోయిన తర్వాత మరో పది నిమిషాలు కథను పొడిగించి స్వాతంత్య్ర ఉద్యమంను చూపిస్తే ఎలా ఉంటుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ క్లైమాక్స్‌ను మార్చి ప్రేక్షకులను అలరించే విధంగా తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. అమితాబ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ వంటి స్టార్స్‌ ఉన్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.

sye-raa-movie-climax