విజయవాడ- హైదరాబాద్ హైవోలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

విజయవాడ- హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సూర్యాపేట జిల్లా కాసింపేట జంక్షన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చివ్వెల మండలం కాసింపేట జంక్షన్ వద్ద కారును ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన కుటుంబం మృత్యువాత పడింది.

అయితే ఆస్పత్రిలో వైద్యం కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న విజయకుమారి, సత్యానందం, జోసఫ్ ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. పాలకొల్లుకు చెందిన ఈ కుటుంబం కొంతకాలంగా విజయవాడలో నివాసముంటుంది.