తెలంగాణలో ఘోరం జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పరిధిలోని కొత్తగూడ గేట్ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న కూరగాయల వ్యాను అదుపు తప్పి ఢీకొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింగి. అయితే ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.