అతి వేగంతో లారీని ఢీకొట్టిన వ్యాను.. ఒకరు మృతి

తెలంగాణలో ఘోరం జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పరిధిలోని కొత్తగూడ గేట్‌ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న కూరగాయల వ్యాను అదుపు తప్పి ఢీకొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింగి. అయితే ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

కాగా గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. రైతులు వ్యాన్లలో కూరగాయలు తరలిస్తుండగా ప్రమాదం భారిన పడ్డారు. ప్రమాద స్థలాన్ని సీఐ జంగయ్య పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.