అనంతలోకాలకు… ‘అతిలోకసుందరి’

Actress Sridevi Sudden demise

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు,తమిళ,మలయాళం,హిందీ ఇలా ఎక్కడకి వెళ్ళిన తన అందంతో అభినయంతో చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి నిన్న రాత్రి భువి నుంచి దివికి వెళ్ళిపోయింది. ఏళ్ళు దాటినా తరగని అ అందాన్ని చూసి బహుశా దేవుడికి కూడా కన్ను కుట్టి ఉంటుంది అందుకే నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మనిషిని అర్ధాంతరంగా అందరికి దూరం చేసి తన వద్దకు తీసుకెళ్ళి పోయాడు అ దేవుడు.

 
మేనల్లుడు మోహిత్ మార్వ వివాహం కోసం మొత్తం కపూర్ కుటుంబం అంత దుబాయ్ లో ఉన్నారు. ఒక్క ఆమె పెద్ద కూతురు జాన్వి  మాత్రమే  దడక్ సినిమా షూటింగ్ కోసం ముంబాయిలో ఉండిపోయారు. పెళ్ళిలో కూడా ఆమె నవ్వుతూ అందరిని పలకరిస్తూ సరదాగా ఉన్నారు. 11 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల ఆమెకు కార్డియాక్ అరెస్ట్ ( గుండె పోటు) అవడంతో కుప్పకూలి పోయారు అలాగే అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఆమె మరణించే సమయానికి ఆమె భర్త బోని కపూర్ చిన్న కూతురు కుషి ఆమెతోనే ఉన్నారు. మరణ వార్త తెలుసుకున్న ఆమె పెద్ద కూతురు వెంటనే దుబాయి బయల్దేరినట్లు సమాచారం.
 
ఆమె మరణంతో మొత్తం అక్కడి కపూర్ కుటుంబం అంత శోక సంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి అకాల మరణం ఆమె కుటుంబాన్ని మాత్రమే కాదు యావత్ సినీ లోకాన్ని కూడా దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్నిఎవరు నమ్మలేక పోతున్నారు రామ్ గోపాల్ వర్మ అయితే తాను ఎంతగానో అభిమానించే శ్రీదేవి ‘ఇక లేదు’అనే విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. ‘శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? ఎవరైనా నన్ను నిద్రలేపి, ఇదొక పీడకల మాత్రమే అని చెప్పండి అని అడిగారు, అందరినీ ఇలా వదిలేసి ఆమె ఒంటరిగా అలా ఎలా వెళ్ళిపోతుంది , ఇప్పుడు దేవుడిని ద్వేషించినంతగా ఎప్పుడు ద్వేషించలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
 
శోక సంద్రంగా సోషల్ మీడియా శ్రీదేవి మరణవార్తతో సోషల్ మీడియా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తొలుత ఆమె మరణవార్త సోషల్ మీడియాలో వచ్చినప్పుడు పుకార్లంటూ అందరూ కొట్టిపడేశారు. అయితే, నిజమని తెలిశాక అందరు  షాక్ కి గురయ్యారు. చాలామంది ట్విట్టార్ వేదికగా తమ దుఖాన్ని పంచుకున్నారు.తాను షాక్ కి లోనయ్యాను చాల డిస్టర్బ్ గా ఉంది,ఒక స్నేహితురాలిని కోల్పోయాను,సినీపరిశ్రమ ఒక లెజెండ్ ని కోల్పోయింది అంటూ ట్విట్ చేశారు రజిని. తనకు మాటలు రావడం లేదని ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది. ఇదో చీకటి రోజని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొంది. కరీనా కపూర్.. శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. శ్రీదేవి మరణంతో వ్యక్తిగతంతా తాను చాలా కోల్పోయానని రిచా చద్దా ట్వీట్ చేసింది. ఆమె మరణంతో వెండితెర మూగబోయిందని పేర్కొంది.ఏడుపు ఆపుకోలేకపోతున్నానని సుమిత్రా సేన్ ట్వీట్ చేశారు. ‘మామ్’ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిద్ధార్థ మల్హోత్రా పేర్కొన్నాడు.
 
శ్రీదేవి మరణం తన గుండెలు పించేసిందని నేహ ధుపియా పేర్కొంది. విషయం తెలిసి తన గుండె బద్దలైందని, షాక్‌లోకి వెళ్లిపోయానని ప్రీతిజింతా పేర్కొంది. చిత్రపరిశ్రమలో ఐకాన్‌గా నిలిచిన శ్రీదేవి ఇంత త్వరగా వెళ్లిపోతారని ఊహించలేదని జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ట్వీట్ చేసింది. తనకు మాటలు రావడం లేదని అద్నాన్ సమీ పేర్కొన్నాడు.సంచలనంగా మారిన అమితాబ్ ట్విట్ శ్రీదేవి మరణానికి కొంత ముందు ఎందుకో తెలిదు “ఎప్పుడు లేనంత ఆందోళనగా ఉంది” అంటూ బిగ్ బి ట్విట్ చేశారు. శ్రీదేవి మరణించడాకి కాసేపటి ముందు ఆయన ఈ ట్వీట్ చేశారు. ఏదో చెడు జరగబోతోందనే విషయం వల్లే ఆయన ఆందోళనకు గురయ్యారా? అని అందరూ చర్చించుకుంటున్నారు.