మూడు విషయాలపై క్లారిటీ ఇచ్చిన నాగ్‌

akkineni-nagarjuna-clarified-about-three-decisions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో, సినీ వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతున్న మూడు విషయాలపై అక్కినేని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. ఆ మూడు విషయాలపై నాగార్జున అధికారిక ప్రకటనతో తెలుగు ప్రేక్షకులు అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ మూడు విషయాల్లో మొదటిది నాగచైతన్య, సమంతల వివాహం గురించి. మరో రెండు రోజుల్లో చైతూ వివాహం సమంతతో జరుగబోతుందని, ఇద్దరి వివాహం గోవాలో జరుగబోతుందని, త్వరలోనే హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఉంటుందని ప్రకటించాడు. చైతూ, సమంతల వివాహం గురించి వస్తున్న పుకార్లకు నాగార్జున ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. మరికొన్ని గంటల్లోనే సమంత మరియు నాగచైతన్యలు ఒక్కటి కాబోతున్నారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

రెండవ విషయానికి వస్తే త్వరలో నానితో కలిసి నాగార్జున ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఆ మల్టీస్టారర్‌ చిత్రాన్ని అశ్వినీదత్‌ నిర్మించబోతున్నాడు. ఈ విషయంపై కూడా గత రెండు వారాలుగా తెగ చర్చలు జరుగుతున్నాయి. ఇది నిజమా కాదా అంటూ కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా నాగార్జున క్లారిటీ ఇవ్వడంతో మల్టీస్టారర్‌ కోసం సంతోషంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మరింత స్పష్టంగా నాగ్‌, నానిల మల్టీస్టారర్‌ విషయమై ప్రకటన రాబోతుంది. వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్‌ అంటే ప్రేక్షకులకు భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు భావిస్తున్నారు.

నాగార్జున క్లారిటీ ఇచ్చిన మూడవ విషయం అఖిల్‌ రెండవ చిత్రం ‘హలో’. అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌, విక్రమ్‌ కుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘హలో’ చిత్రాన్ని ఈనెలలో పూర్తి చేయబోతున్నారు. అక్టోబర్‌లో చిత్ర నిర్మాణం పూర్తి చేసి, నవంబర్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు నిర్వహించి, డిసెంబర్‌లో ‘హలో’లోను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు. అదే విషయాన్ని దర్శకుడు విక్రమ్‌కు నాగార్జున చెప్పాడట. ప్రస్తుతం మిగిలి ఉన్న బ్యాలన్స్‌ పార్ట్‌ను పూర్తి చేసే పనిలో విక్రమ్‌ అండ్‌ టీం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా కళ్యాణీ ప్రియదర్శన్‌లు నటిస్తుంది. నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూడు విషయాలను త్వరలో విడుదల కాబోతున్న ‘రాజుగారి గది 2’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా చెప్పుకొచ్చాడు.