జక్కన్న మల్టీస్టారర్‌ వెయిట్‌ పెరిగింది

Allu Arjun is a key role in NTR and Ram Charan's multi starrer film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ జక్కన్న ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. అక్టోబర్‌లో ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు సినిమా గురించిన చిన్న విషయం కూడా మీడియాకు దర్శకుడు రాజమౌళి కాని, నిర్మాత దానయ్య కాని చెప్పింది లేదు. కాని మీడియాలో మాత్రం వందల కొద్ది పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మల్టీస్టారర్‌ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. తాజాగా జక్కన్న రాజమౌళి తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రానికి సంబంధించిన మరోఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త నిజం అవ్వాలని ఫ్యాన్స్‌ కూడా కోరుకుంటున్నారు.

ఇంతకు ఆ వార్త ఏంటీ అంటే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు నటించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రంలో అల్లు అర్జున్‌ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తాడట. రాజమౌళి చిత్రాల్లో విలన్స్‌ చాలా పవర్‌ ఫుల్‌గా కనిపిస్తారు. అంటే మల్టీస్టారర్‌ చిత్రంలో అల్లు అర్జున్‌ను జక్కన్న విలన్‌గా చూపిస్తాడా అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా కూడా జక్కన్న అడిగితే విలన్‌ పాత్రలో ఏంటీ చిన్న కమెడియన్‌ పాత్రలో నటించేందుకు అయినా సిద్దపడతారు. అంతటి క్రేజ్‌ను దక్కించుకున్న జక్కన్న మల్టీస్టారర్‌ చిత్రంలో అల్లు అర్జున్‌ ఒక పాత్రలో నటించబోవడం పెద్ద ఆశ్చర్యకర విషయం ఏమీ కాదు. మల్టీస్టారర్‌కు మరో మెగా హీరో జోడైతే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.