బాలయ్యకి సెటైర్… బాబు మాత్రం పవర్ హౌస్.

Anand Mahindra praises Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈమధ్య జైసింహా సినిమా లో ఓ సీన్ గురించి చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. బొలెరో వాహనాన్ని బాలయ్య ఒంటి చేత్తో లేపిన సీన్ ని ఓ నెటిజెన్ ఆనంద్ మహీంద్రాకు టాగ్ చేశారు. ఆ సీన్ మీద ఆయన సరదాగా స్పందించారు. ఇలా అయితే మా వర్క్ షాప్ లో హైడ్రాలిక్ లిఫ్ట్ ల అవసరం లేదని ఆయన ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో హల్ చెల్ చేసింది. ఎప్పటిలాగానే ఆనంద్ మహీంద్రా సరదాగా చేసిన కామెంట్ ని కొందరు బాలయ్యకు వ్యతిరేకంగా కూడా వాడుకున్నారు.

ఇప్పుడు అదే ఆనంద్ మహీంద్రా ఓ పారిశ్రామికవేత్తగా దావోస్ ఆర్ధిక సదస్సుకు వెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. ఆ సందర్భంగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ లో చంద్రబాబుని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. “చంద్రబాబుని కలవడం దావోస్ సదస్సులో నాకు హైలైట్. ఆధునిక భారతంలో ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమైన నేత. ఆయన్ని కలవడం అంటే పవర్ ప్యాక్ లో ప్లగ్ పెట్టినట్టే. దీంతో మన బ్యాటరీలు వెంటనే రీఛార్జ్ అవుతాయి “ అని ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ చూసి టీడీపీ అభిమానులు పొంగిపోతున్నారు.

Anand Mahindra tweet on AP CM