అనసూయ సంచలన నిర్ణయం

Anasuya sensational decision

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బుల్లి తెరపై హీరోయిన్‌ కంటే ఎక్కువ స్థాయిలో అందాలను ఆరబోస్తూ అందరిని ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ అనసూయ. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెల్సిందే. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఇలా అన్నింటిలో కూడా అనసూయ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక అప్‌ డేట్‌ పెడుతూ, అభిమానులతో అప్పుడప్పుడు లైవ్‌ చాట్‌ చేస్తూ ఉంటుంది. అలాంటి అనసూయ సోషల్‌ మీడియాలకు గుడ్‌బై చెబుతున్నట్లుగా ప్రకటించింది. తాను మంచి ఉద్దేశ్యంతో సోషల్‌ మీడియాలో ఉండాలనుకుంటే, కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తన నాకు తీవ్ర మనోవేదన కలిగించిందని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా తార్నకలో ఒక కుర్రాడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఫోన్‌ను తీసుకుని నేలకు కొట్టింది. దాంతో ఫోన్‌ పగిలి పోయింది, అదే సమయంలో ఆ కుర్రాడిని మరియు ఆ కుర్రాడి తల్లిని అనసూయ మాటలతో దూషించింది. అనసూయ ప్రవర్తనపై పోలీసులకు ఆ తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వార్త కాస్త మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సమయంలోనే అనసూయను టార్గెట్‌ చేస్తూ తీవ్ర పదజాలంతో అనసూయను తిడుతూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా ఇలా అన్నింటిలో కూడా పోస్ట్‌లు, కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ విమర్శలను తట్టుకోలేక తాను సోషల్‌ మీడియాకు గుడ్‌ బై చెబుతున్నట్లుగా ప్రకటించింది. అనసూయ సోషల్‌ మీడియాకు గుడ్‌బై చెప్పడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమర్శలకు భయపడి సోషల్‌ మీడియాను వదలవద్దని ఆమె సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నారు. మరి అనసూయ మళ్లీ సోషల్‌ మీడియా రీ ఎంట్రీ ఇస్తుందా అనేది చూ