పూజా హెగ్డే మరీ ఇంత ఖరీదా?

pooja hegde remuneration for Item Song in Rangasthalam Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాల్లో నటించిన పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో అప్పుడు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ చిత్రా తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ అమ్మడు ఇటీవలే ‘డీజే’ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్‌కు జోడీగా ‘డీజే’ చిత్రంలో నటించడంతో ఒక్కసారిగా పూజా హెగ్డేకు స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ దక్కింది. ‘డీజే’ చిత్రం తర్వాత ఈమెకు బారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసేందుకు సిద్దం అయ్యింది.

‘రంగస్థలం’ చిత్రంలో పూజా ఐటెం సాంగ్‌ చేసేందుకు ఏకంగా 50 లక్షల పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా సినీ వర్గాల్లో విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌ కాజల్‌, తమన్నాలు గతంలో ఐటెం సాంగ్స్‌ కోసం ఇంత భారీ స్థాయిలో పారితోషికం తీసుకున్నారు. కాని మూడు నాలుగు సినిమాలు కూడా చేయకుండానే పూజా హెగ్డే అప్పుడే 50 లక్షల పారితోషికం, అది కూడా కేవలం ఐటెం సాంగ్‌కే తీసుకోవడం చర్చనీయాంశంగా ఉంది.

పూజా హెగ్డే అందాల ఆరబోతతో పాటు, మంచి డాన్స్‌ కూడా చేస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే రంగస్థలం చిత్రం ఐటెం సాంగ్‌ చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఐటెం సాంగ్‌ హైలైట్‌గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.