Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మలయాళ ప్రేమమ్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్కు తెలుగు ‘ప్రేమమ్’ చిత్రంలో కూడా అవకాశం దక్కింది. వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకున్న అనుపమ ఆ తర్వాత తెలుగులో వరుసగా చిత్రాలు చేసి మెప్పిస్తూ వస్తుంది. ఈ సంవత్సరం ‘శతమానం భవతి’ మరియు ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలతో ఈ అమ్మడు సక్సెస్లు దక్కించుకుంది. తాజాగా రామ్తో విజయాన్ని సొంతం చేసుకున్న అనుపమ మీడియాతో మాట్లాడుతూ తెలుగులో తనకు శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. తోటి హీరోలు అంతా కూడా తనకు సమానం అని, కాకుంటే శర్వానంద్ అంటే తనకు ప్రత్యేకం అంటూ అనుపమ చెప్పుకొచ్చింది.
శర్వానంద్, అనుపమలు కలిసి ‘శతమానంభవతి’ చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మద్య సన్నిహిత్యం ఏర్పడటం జరిగింది. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం కూడా సాగుతుందని ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలను ముద్దుగుమ్మ అనుపమ కొట్టి పారేసింది. అనుపమకు శర్వానంద్ మంచి స్నేహితుడు మాత్రమేనట. తనకు సంబంధించిన అన్ని విషయాలను శర్వాతో షేర్ చేసుకుంటాను అని, సినిమాల ఎంపిక విషయంలో కూడా శర్వాతో చర్చిస్తాను అంటూ అనుపమ చెప్పుకొచ్చింది. ఒక హీరోయిన్ ఒక హీరోతో ఇంత స్నేహంగా ఉండటాన్ని సహజంగా అయితే ప్రేమ అంటారు. కాని అనుపమ మాత్రం తమది ప్రేమ కాదు అంటూ గట్టిగా చెబుతుంది. నిజంగానే వీరిద్దరు నిజమైన బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారేమో. ప్రస్తుతం అనుపమ నాని మరియు సాయి ధరమ్ తేజ్లతో కలిసి నటిస్తుంది. త్వరలోనే శర్వానంద్తో ఈమెను మరో సినిమాలో జంటగా చూడవచ్చు అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.