నంద్యాల నేతలూ ఖబడ్దార్..!

AP CM Chandrababu Warning To TDP Leaders Over Discipline

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

AP CM Chandrababu Warning To TDP Leaders Over Discipline

నంద్యాల టీడీపీ నేతలకు చంద్రబాబు చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటిదాకా నేతల్ని బుజ్జగించి అలసిపోయిన ఆయన.. ఇక అల్టిమేటం జారీ చేశారు. పొరపాటున నంద్యాల ఓడిపోయామంటే.. మీ సంగతి చెబుతానని పాత చంద్రబాబు లెవల్లో ఫోన్లు చేస్తున్నారట. దీంతో నేతలకు టెన్షన్ మొదలైంది. ఇప్పటిదాకా బాబు అంతే అంటార్లే అని లైట్ తీసుకున్న నేతలు హుటాహుటిన రంగంలోకి దిగిపోయి, ప్రత్యర్థుల్ని కూడా కలుపుకుపోయి మరీ ప్రచారం చేయడం క్యాడర్ కు ఆశ్చర్యంగా ఉంది.

అయితే విషయం తెలిసి బాబు కన్నెర్ర చేస్తే ఇలాగే ఉంటుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. లేకపోతే అలకపాన్పు ఎక్కిన ఎస్వీ సుబ్బారెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్, కనిపించకుండా ఎస్పీవైరెడ్డి అందరూ నంద్యాలలోనే కనిపిస్తున్నారు. ఏకంగా ఆరుగురు మంత్రులు నంద్యాలలోనే తిష్ట వేశారు. ప్రతిరోజూ ఎన్నోకొన్ని చేరికలు వైసీపీ నుంచి టీడీపీకి ఉంటున్నాయి. ఒక్కసారిగా పాలిటిక్స్ వేడెక్కడంతో అటు జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

శిల్పా వస్తే గెలిచినట్లే అని భావించిన జగన్ కు తాజా పరిణామాలు మింగుడుపడటం లేదు. అఖిలను ఎదుర్కోవడం కష్టం కాదు కానీ.. ఇంతమంది సీనియర్లను ఫేస్ చేయడం శిల్పాకు ఈజీ కాదని జగన్ కు ఇప్పటికే సమాచారం వచ్చిందట. పైగా భూమా చనిపోయిన సానుభూతి ఉండనే ఉంది. టీడీపీకి భారీ మెజార్టీ వస్తే వైసీపీ శాల్తీ గల్లంతవుతుందని జగన్ భయపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు సీరియస్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో.. నంద్యాల టీడీపీ నేతల ప్రచారమే చెబుతోంది.

మరిన్ని వార్తలు: