చెప్పులు కుట్టిన ఏపీ మంత్రి.

jawahar Sandals stitching in eluru bus stand against to manda krishna madiga

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్ర ప్రదేశ్ ఎక్సయిజ్ శాఖ మంత్రి జవహర్ అనూహ్య నిరసన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొద్ది రోజులుగా మంద కృష్ణ ఏపీ లో చేస్తున్న కార్యక్రమాలకు దీటుగా ఏలూరు పాత బస్ స్టాండ్ సమీపంలో చెప్పులు కుడుతూ నిరసన తెలిపారు. దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి మంద కృష్ణ మాదిగ ప్రయత్నిస్తున్నాడని జవహర్ ధ్వజమెత్తారు. ఏపీ లో విస్తృతంగా పర్యటిస్తున్న కృష్ణ మాదిగ ఈ నెల 7 న అమరావతిలో కురుక్షేత్ర సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆ సభని జరిపి తీరతామని కృష్ణ మాదిగ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన్ని కౌంటర్ చేయడానికి అదే వర్గానికి చెందిన జవహర్ రంగంలోకి దిగారు.

 మరిన్ని వార్తలు 

కేటీఆర్ కి పాత మిత్రుడి లేఖ.