AP Politics: ఇవాళ రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

AP Politics: AP government will introduce two bills today
AP Politics: AP government will introduce two bills today

ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు అన్న సంగతి తెలిసిందే. నిన్న ఏపీ బడ్జెట్‌ ను బుగ్గన ప్రవేశ పెట్టారు. ఇక ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కానుంది. దీంతో ఈరోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై మండలిలో చర్చ జరుగనుంది. ఇక చర్చ అనంతరం మండలిలో కూడా సమాధానం ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన చెప్పనున్నారు. అలాగే..మండలిలో మూడు బిల్లులను పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇక అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు -2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు -2024 రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.