AP Politics: ఇవాళ క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొననున్న సీఎం జగన్

Election Updates: Jagan's bus trip from Idupulapaya to Ichapuram: Sajjala
Election Updates: CM Jagan will announce YCP party candidates today

ఇవాళ క్రిస్మస్‌ ప్రార్ధనల్లో ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి పాల్గొననున్నారు. అంతేకాదు..సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. మూడో రోజుల పాటు సొంత జిల్లాలో ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి పర్యటించారు . కాసేపట్లో ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌ నుంచి పులివెందులకు బయలుదేరనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి.

9 గంటలకు పులివెందులోని సీఎస్‌ఐ చర్చ్‌కు చేరుకోనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. సీఎస్ఐ చర్చ్‌లో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో సీఎం జగన్, సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఇక ఈ తరుణంలోనే… రెండు గంటల పాటు ప్రార్థనలు జరుగనున్నాయి. అటు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి.