Crime: తమ్ముడు ఆత్మహత్య.. మరదలిని సజీవదహనం చేసిన అన్న

Crime: Brother commits suicide
Crime: Brother commits suicide

మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో శనివారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన సోదరుడి ఆత్మహత్యకు కారణమైందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి మరదలిని సజీవదహనం చేశాడు. వ్యక్తిగత కారణాలతో ప్రకాశ్ ఆర్నెల్లకిందట ఆత్మహత్య చేసుకోగా.. అతడి భార్య నిర్మల తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తింటి వద్దే నివసిస్తోంది. తమ్ముడి బలవన్మరణానికి నిర్మలే కారణమంటూ సురేశ్ ఆమెను వేధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాడ్డుతో దాడికి దిగిన సురేశ్.. అనంతరం నిర్మలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ‘మీ సోదరికి నిప్పంటించాం ’ అని నిందితుడే తమకు ఫోను చేసి చెప్పినట్లు నిర్మల సోదరుడు మీడియాకు తెలిపాడు. భర్త చావుకు తన సోదరే కారణమని.. ఆమెను చంపేస్తానని సురేశ్ గతంలోనూ బెదిరించినట్లు ఆరోపించాడు. ఆమెను పుట్టింటికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యేలోపు ఈ ఘోరం జరిగినట్లు వాపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.