AP Politics: జగన్ బర్త్ డేకి 560 కిలోల భారీ కేక్ ను కట్ చేసిన సజ్జల

AP Politics: Sajjala cut a 560 kg cake for Jagan's birthday
AP Politics: Sajjala cut a 560 kg cake for Jagan's birthday

560 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు వైసీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. మన కాళ్ళ పై మనం నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకుని రావటం అంత తేలిక కాదన్నారు.

దీన్ని చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ అని కొనియాఆరు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ ఎదగటం గర్వ కారణమని.. వైఎస్ఆర్ కన్న కలలను నిజం చేస్తున్న వ్యక్తి జగన్ అని వెల్లడించారు. ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా బతికగలిగే అవకాశం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తుంది… ప్రజలకు ఏం చేయనవసరం లేదు…చేసినట్లు నటిస్తే చాలు అని భావించే వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. మీడియాను అడ్డం పెట్టుకుని ఏదో చేసినట్లు ప్రజలకు భ్రమ కల్పించవచ్చని చంద్రబాబు భావిస్తారని మండిపడ్డారు వైసీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.