AP Politics: ఏపీ రాజ్యసభకి పోటీలో ముగ్గురు అభ్యర్థులు ప్రకటించిన వైసీపీ..!

AP Politics: YCP announced three candidates in AP Rajya Sabha contest..!
AP Politics: YCP announced three candidates in AP Rajya Sabha contest..!

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభకు పోటీ చేసే ముగ్గురు వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబు రావు పేర్లను ఖరారు చేశారు. రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ తాజాగా ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. నేటి నుంచి ఈనెల 15 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరుగనుంది.

అసెంబ్లీలో సీఎం కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి వీరు కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను సీఎం అభినందించారు. మేడ రఘునాథ రెడ్డి నందలూరు మండలం చెన్నయ్య పల్లెకు చెందిన వారు, మాజీ టీడీడీ బోర్డు మెంబర్ మేడా రామకృష్ణారెడ్డికి ముగ్గురు కుమారుల్లో రెండో కుమారుడు మేడా రఘునాథరెడ్డి. మొదటి కుమారుడు సిట్టింగ్ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. మేడ రఘునాథరెడ్డి అదే మండలంలోని టంగుటూరులో విద్యాబ్యాసం చేశారు. డిగ్రీ పూర్తయిన వెంటనే 20 ఏళ్ల వయస్సులోనే బెంగళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి రఘునాథరెడ్డి ప్రవేశించారు.