దాసరిని తలుచుకొని బాలకృష్ణ కన్నీళ్లు..!

ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ దాసరి నారాయణరావు ఉండి ఉంటే ఎంతో బాగుండేదంటూ నందమూరి బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా, తలలో నాలుకగా ఆయన ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి విజయోత్సవ వేడుకలో దాసరిని గుర్తు చేసుకుంటూ బాలయ్య భావోద్వేగానికి గురయ్యారు. బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.140 కోట్లు వసూల్ చేసి బ్లాక్ బస్టర్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్​లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది . ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మాత అంబికా కృష్ణ వంటి గారు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

దాసరిని తలుచుకొని బాలకృష్ణ కన్నీళ్లు..! - Telugu Bullet

వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం తన తండ్రి ఎన్టీఆర్ నుంచి తనకు వచ్చిందని బాలకృష్ణ గారు అన్నారు. ఆడియన్స్‌ అడగకముందే మంచి కథలను పరిచయం చేస్తే విజయం తప్పక వరిస్తుందనడానికి ‘భగవంత్‌ కేసరి’ నిదర్శనమని తెలియచేసారు . ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్‌ కేసరి’లాంటి సినిమాలన్నీ తనకు సవాలుతో కూడుకున్నవేనని.. ఈ సినిమా కి పని చేసిన వారందరినీ సత్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బాలయ్య తెలిపారు.